చిక్కడపల్లి, నవంబర్ 4 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్లో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆరోపించారు. అఖిల భారత మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)2వ జాతీయ మహాసభలు శుక్రవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు, కార్మిక చట్టాలు ఏమీ అమలు కావడం లేదన్నారు.
సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి ఎ.ఆర్.సింధూ మాట్లాడుతూ… భారత దేశంలో లక్షలాది మంది పిల్లలకు ఆకలి, పోషకాహారం లోపంతో బాధపడుతున్నారని తెలిపారు. ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జై భగవాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫెడరేషన్ జాతీయ అధ్యక్షురాలు వరలక్ష్మి, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి, అంగన్వాడీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ఉష, ఆశ వర్కర్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షురాలు సురేఖ, మిడ్ డే మీల్ ఫెడరేషన్ నాయకులు స్వరూపరాణి, ఎస్.రమ పాల్గొన్నారు.