హైదరాబాద్ : రోడ్లపై అతివేగంతో దూసుకెళ్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో అతివేగానికి యువకుడు బలయ్యాడు. బైక్ అదుపుతప్పి ఆరాంఘర్ చౌరస్తా వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.