బంజారాహిల్స్/హిమాయత్నగర్, నవంబర్ 19: పేదలను ఆదుకుంటూ ఒకవైపు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకే మరోసారి అధికారం ఇవ్వాలని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ కోరారు. ఆదివారం ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని తుమ్మలబస్తీ, చింతల్బస్తీ, ఎరుకల బస్తీ, సప్తమాతవీధి. భోళాశంకర్ భక్త సమాజ్ తదితర ప్రాంతాల్లో దానం నాగేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బస్తీల్లో సొంతింటి స్థలం కలిగిన పేదలకు గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల చొప్పున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ను గెలిపిస్తే ఆసరా పింఛన్లను రూ.5వేలు అందిస్తామని, రేషన్ కార్డు ఉన్న వారందరికీ రూ.15లక్షల ఆరోగ్యబీమా అందిస్తామని, ప్రతి వ్యక్తికి రూ.5లక్షల జీవిత బీమా, మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి పథకం, రేషన్ కార్డులపై సన్నబియ్యం, రూ.400కే గ్యాస్ సిలిండర్ లాంటి అనేక పథకాలు అమల్లోకి తీసుకువస్తామని వివరించారు. చింతల్బస్తీ, తుమ్మలబస్తీ,బిస్తీవాడ తదితర ప్రాంతాల్లో సుమారు రూ.6కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు పూర్తిచేశామని దానం నాగేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు అర్షద్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కే.అరుణ్కుమార్, నాగేశ్వర్రావు. అనిల్కుమార్. సంతోష్, సత్తార్. రూపేష్. జావెద్, వార్డు సభ్యులు మున్నీ, సమత, లక్ష్మీ, సుమిత్రాబాయ్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఓట్ల కోసం వస్తున్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు చెప్పే మాయ మాటలను నమ్మి ఓటేస్తే గోసపడటం తథ్యమని హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మిగౌడ్,బీఆర్ఎస్ నాయకులుజి.రామన్గౌడ్, ఆర్.అశోక్కుమార్ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియో జకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ను ఆదరించి గెలిపించాలని కోరారు. ఆదివారం హిమాయత్నగర్ డివిజన్లో వారు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొల్కుల శ్రీకాంత్, మహేష్, జైస్వాల్,అనీష్, బింధ్యా జైస్వాల్,శారద ,మల్లేశ్,శేఖర్,పూజ,సుజాత, సాయి,రితేష్, జగదీశ్, కొండయ్య పాల్గొన్నారు.
దివ్యాంగులను గౌరవించిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాలని ఆకాంక్షిస్తూ హిమాయత్నగర్లో ఓ దివ్యాంగుడు ప్రచారం చేశారు.అతడి వాహనానికి ప్లకార్డును కట్టుకుని ఖైరతాబాద్ బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ను గెలిపించాలని కోరుతూ చేసిన ఎన్నికల ప్రచారం పలువురిని ఆకర్శించింది.ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి రామన్గౌడ్ ప్రత్యేకంగా దివ్యాంగుడిని అభినందించారు.