మంత్రి కేటీఆర్
మేడ్చల్, నమస్తే తెలంగాణ / మేడ్చల్ / మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు ఆయన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరాతో పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయని చెప్పారు. ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందజేస్తున్నారని, గుంట భూమి ఉన్న రైతుకు కూడా రూ.5 లక్ష బీమా అమలవుతుందని అన్నారు. మర్రి రాజశేఖర్రెడ్డి కృషితో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సాకారమైందని, దీంతో 2 వేల మందికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా సంప్రదాయ పంటల నుంచి కూరగాయలు, పండ్లు తదితర ఉద్యానవన పంటలకు రైతులు మరలి, లబ్ధి పొందే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ రైతులకు అండగా ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో రైతుకు మరింత మంచి రోజులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు, టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయేందర్రెడ్డి, సర్పంచ్ జ్యోతిచంద్రశేఖర్రెడ్డి, ఎంపీటీసీ రఘు, డీసీసీబీ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, పీఏసీఎస్లు చైర్మన్లు సుధాకర్ రెడ్డి రణదీప్రెడ్డి, సురేశ్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్యాదవ్, సుదర్శన్, నాయకులు భాస్కర్యాదవ్, మద్దుల శ్రీనివాస్రెడ్డి, జహంగీర్, రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, జగన్రెడ్డి, నర్సింహరెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్, ఫిబ్రవరి17: మేడ్చల్ జిల్లా పూడురులో మంత్రి కేటీఆర్ను గురువారం జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాలతో సత్కరించారు. అనంతరం సహకార సంఘాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, చైర్మన్లకు గౌరవ వేతనం పెంచడంతో పాటు ప్రొటోకాల్ను కల్పించేలా కృషి చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఆయనను కలిసిన వారిలో సహకార సంఘం చైర్మన్లు గరిశె నరేందర్రాజు, మిద్దెల బాల్రెడ్డి, సుదర్శన్రెడ్డి, మధుకర్రెడ్డి, రణదీప్రెడ్డి, సురేశ్రెడ్డి ఉన్నారు.