మణికొండ, జనవరి 22 : గండిపేట మండలంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభలో భక్తులు మునిగి తేలారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్పస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా భక్తులు పెద్దఎత్తున బోనాల ఊరేగింపులతో స్వామి వారికి సమర్పించారు. అంతకు ముందు బీరప్పస్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నార్సింగి మున్సిపాలిటీ నార్సింగి గ్రామంలో మల్లిఖార్జునస్వామి కల్యాణ మహోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్దఎత్తున బోనాలతో స్వామి వారికి సమర్పించి, కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాలగూడ కురుమ సంఘం నాయకులు బట్ట మహేందర్, యాదయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్, నార్సింగి నాయకులు అశోక్యాదవ్, వినోద్కుమార్, రాములు, మహేందర్, వివిధ గ్రామాల నుంచి నాయకులు పాల్గొన్నారు.
కామేశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటికాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీకామేశ్వరాలయంలో ఆదివారం వేదపండితుల మంత్రోచ్ఛరణలతో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు జరిపించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ దాతలు సీతారాం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.