కాచిగూడ, మే 24 : కొడంగల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతుల గురించి మాట్లాడకుండా రెడ్లకు పగ్గాలు ఇవ్వాలని ఒక కులాన్ని ప్రస్తవించడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆరోపించారు.
మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి జాతీయ పార్టీకి అధ్యక్షుడివా..? లేదంటే రెడ్డి కుల సంఘానికి అధ్యక్షుడివా.? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 90శాతం బహుజనులు ఉన్నారని, వారు తలుచుకుంటే నీవెక్కడ..? నీ పదవెక్కడ.? అని ప్రశ్నించారు. ఇప్పటికైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనుకోవాలని హితవు పలికారు.