ముషీరాబాద్, ఆగస్టు 24 : వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం బీసీబంధు అమలు చేస్తూ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. అడిక్మెట్లో లబ్ధిదారులు, బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. అడిక్మెట్ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు శ్యామ్సుందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, మాధవ్, సయ్యద్ అస్లాం, సురేందర్, ప్రవీణ్, గురుదీప్సింగ్, ప్రకాశ్ దేవ్డా, అబిద్, మాణిక్ప్రభు, సత్యనారాయణ, గిరి, నాగులు, జ్ఞాని, అస్లాం, లక్ష్మణ్ పాల్గొన్నారు.
అంబర్పేట, ఆగస్టు 24 : బీసీ కులవృత్తి దారులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయడం పై హర్షిస్తూ…అంబర్పేట నియోజకవర్గం నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీరాములు ముదిరాజ్ నేతృత్వంలో బాగ్అంబర్పేట డివిజన్ రెడ్బిల్డింగ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు జి.వినయ్కుమార్, ఎంకే శ్రీను, జై గణేశ్, నగేశ్, ఎస్.రాజు, ఏ.శ్రీనివాస్, ఏ.బాలరాజు, కె.లత, సి.ఉమా, సుష్మలతో పాటు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, అఫ్రోజ్పటేల్, శివకుమార్ గుప్తా, రవీందర్, రమేశ్, కాడిగె శ్రీనివాస్, ఎ.శ్రీనివాస్, వెంకటేశ్, ప్రవీణ్, రాజు, మెడికల్ శ్రీను పాల్గొన్నారు.
దివ్యాంగుల పింఛన్ను రూ. 3,016 నుంచి రూ. 4,016 కు పెంచి తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పలువురు దివ్యాంగులు పేర్కొన్నారు. పింఛన్ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం కవాడిగూడలోని జీహెచ్ఎంసీ గ్యారేజీలోని పార్కింగ్ యార్డులో స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బండారి యాదగిరి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జగన్, సుధాకర్, జగదీష్, నాజిమ్, దయానంద్, శ్రీనివాస్ గౌడ్, గణేశ్, శ్రీనివాస్, వెంకటేశ్, లింగప్ప, సంతోష్, యాకయ్య, సతీశ్, ఉమా, శ్రీనివాస్, ఎండీ హేస్సేన్, సతీశ్, రవీందర్, సందీప్, గంగారామ్ తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్, ఆగస్టు 24 : దివ్యాంగుల పింఛన్ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ నాచారం వైజయంతి సినిమా టాకీస్ వద్ద వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బూడిద గణేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిట్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, దివ్యాంగులు యాదగిరి, మల్లేశ్, ఉప్పలమ్మ, విద్య, నరేందర్, నాయకులు ముత్యంరెడ్డి, కర్ణ, అంజి, భూపాల్రెడ్డి, శివ, కట్టబుచ్చన్న గౌడ్, విఠల్ యాదవ్, అశోక్, రమేశ్, వాసు, సుగుణాకర్రావు, కుమార్, హరిప్రసాద్, నర్సింగ్రావు, మధుకర్రెడ్డి, శివ, దత్తు, శ్రీనివాస్, లడ్డు, శివకుమార్, ఖదీర్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.