పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న బస్తీ దవాఖానల సేవలు మరింత విస్తరించనున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరాంనగర్ క్లస్టర్ పరిధిలో ఇప్పటికే 15 బస్తీ దవాఖానలు సేవలందిస్తుండగా తాజాగా మరో 2 బస్తీ దవాఖానలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే 133 బస్తీ దవాఖానలు సేవలందిస్తుండగా తాజాగా మరో 16 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని శింగారి బస్తీతో పాటు యూ సుఫ్గూడ బస్తీలో కొత్తగా రెండు బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధమయ్యా యి. దీనితో పాటు స్టేట్ హోం లోని బాలికా సదనంలో మ రో బస్తీ దవాఖాన ప్రారంభానికి సిద్ధం కానుంది.
పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్న బస్తీ దవాఖానలకు నగరంలో విశేషమైన ఆదరణ పెరుగుతున్నది. దీంతో ఒక్కో వార్డులో కనీసం రెండు బస్తీ దవాఖానలు ఏర్పాటుచేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 168 బస్తీ దవాఖానలు ఏర్పాటు లక్ష్యంకాగా ఇప్పటికే 133 బస్తీ దవాఖానలు క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్నాయి. దీనితో పాటు త్వరలో మరో 16 బస్తీ దవాఖానలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు లక్ష్యాన్ని చేరుకునేందుకు మరో 19 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
యూసుఫ్గూడ బస్తీ దవాఖానతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరో రెండు బస్తీ దవాఖానలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇటీవల ఎన్నికల కోడ్తో వాటి ప్రారంభోత్సవానికి కొంత ఆలస్యం జరిగింది. ఆయా భవనాలలో ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు సైతం ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆదేశాలతో మే నెలలో మరో 16 బస్తీ దవాఖానలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తాం. – డా. రుక్మారెడ్డి, హైదరాబాద్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్