చిక్కడపల్లి : ప్రజల సమస్యలు తెలసుకోవడానికి చేపట్టిన బస్తీ బాట కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి లోని అచ్చయ్య నగర్ బస్తీ, ఈడబ్ల్యుఎస్ క్వార్టర్స్, బృందావన్ కాలనీ తదితర కాలనీల్లో ఎమ్మెల్యే బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీలల్లో పర్యటించి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చయ్యనగర్లో డ్రైనేజీ సమస్య, పోలీస్ పేట్రోలింగ్ ఏర్పాటు చేయాలని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.
అవసరం ఉన్న చోట నూతన మంచినీటి పైప్లైన్లు, డ్రైనేజీ పైప్లైన్లు నిర్మాణం చేపడుతామని అన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, బాగ్లింగంపల్లి వాటర్వర్క్ మేనేజర్ జీవన జ్యోతి, ఏఈ మురళీ, డివిజన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రావులపాటి మోజస్,మన్నె దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.