సిటీబ్యూరో, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ, ఆపదలో ఉన్న మహిళలకు మేమున్నామంటూ హైదరాబాద్ మహా నగర పోలీసులు భరోసా ఇస్తున్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నగర పోలీసు వ్యవస్థలో ప్రత్యేకంగా భరోసా కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. అఘాయిత్యాలు, వేధింపులకు గురయ్యే మహిళలు, పిల్లల కోసం ఇక్కడ నిపుణులైన మహిళా సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహిస్తూ, ఆత్మ ైస్థెర్యాన్ని నింపుతున్నారు. షీ టీమ్స్, భరోసా కేంద్రానికి అదనపు పోలీస్ కమిషనర్ శిఖా గోయెల్ నేతృత్వంలో అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్ర బృందం ఇక్కడ పనిచేస్తున్నది. అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు తదితర ఘోరమైన ఘటనలు జరిగిన సమయాలలో బాధితులకు అన్ని రకాలైన సేవలు ఒకేచోట అందించే లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నది. చిన్న పిల్లలు, మహిళలపై జరిగే దాడులు, లైంగిక దాడులకు సంబంధించిన ఫిర్యాదులతో పోలీస్ష్టేషన్కు రాగానే వెంటనే స్థానిక పోలీసులు భరోసా కేంద్రానికి బాధితులను పంపించి, ముందుగా వారికి తగిన సహాయక చర్యలు అందిస్తున్నారు. వివిధ రకాలైన వేధింపులకు గురయ్యే బాధితులు నేరుగా భరోసా కేంద్రానికి వెళ్లి సేవలు పొందుతున్నారు.
భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి ఫిర్యాదు రికార్డవుతుంది. దీని కోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ను రూపొందించారు. బాధితుల ఫిర్యాదు , కౌన్సెలింగ్, మెడికల్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన విషయాలు రికార్డు చేస్తారు. ఏ బాధితురాలితో ఎవరు మాట్లాడా రు? ఎవరు వైద్యం చేశారు? ఎవరు న్యాయ సేవలు, ఎవ రు కౌన్సెలింగ్ చేశారు? అ న్న విషయాలన్ని పక్కాగా రి కార్డు చేస్తారు. సదరు బాధితులు ఎప్పుడు వచ్చి నా వారి కేసు హిస్టరీ మొ త్తం డాటాబేస్లో భద్రం గా ఉంటుంది. మహిళ లు, పిల్లల భద్రతకు రక్షణగా ఉండే భరోసా కేం ద్రం నగర పోలీస్ కమిషనర్ అధ్యక్షతన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థగా కొనసాగుతున్నది.
అఘాయిత్యాలకు గురయ్యే బాధితులకు కావాల్సిన వైద్య ఆరోగ్య సేవలు, న్యాయ సేవలు, మానసిక ఒత్తిడికి లోనయిన వారికి నిపుణులు కౌన్సెలింగ్, శిక్షణ, పునరావాస సౌకర్యం కల్పిస్తున్నారు. సమాజంలో వారు తలెత్తుకొని తిరిగే విధంగా వారిని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సంస్థ పని చేయనుంది. సమాజంలో మహిళలు, బాలలపై జరిగే కిరాతక చర్యలకు అడ్డుకట్ట వేస్తూ, బాధితులకు న్యాయ స్థానాలలో తగిన న్యాయం జరిగి, నిందితులకు శిక్షలు పడే విధంగా ఈ కేంద్రం అవసరమైన అన్ని రకాల సేవలను అందిస్తుంది. నగరంలో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలలోని బాధితులకు సంబంధించి భరోసా కేంద్రం అధికారులే స్వయంగా వివరాలు సేకరించారు. బాధితుల మానసిక పరిస్థితిని అంచనా వేస్తూ వాళ్లకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందనే భరోసానిస్తూ వారిలో ఆత్మ ైస్థెర్యాన్ని నింపుతున్నారు. ఫిర్యాదుదారులు ఏమంటున్నారు? ఏమి జరిగింది? ఫిర్యాదులలో నిజమెంత? అనే అంశాలపై మహిళా అధికారులు స్వయంగా రంగంలోకి దిగి పూర్తి వివరాలను సేకరిస్తూ, జరిగిన వాస్తవాలను వెలుగులోకి తేవడంలో తమ వంతు పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళలు, పిల్లలకు భరోసా కల్పిస్తూ, కేంద్రం ఏర్పాటైన లక్ష్యాన్ని చేరుకుంటున్నారు.
మహిళలు, పిల్లలు అత్యాచారాలకు, చిత్రహింసలు, ఇతరత్రా వేధింపులకు గురయ్యే వారు ఈ కేంద్రానికి రావొచ్చు. కుటుంబంలో కాని, సమాజంలో కాని, పనిచేస్తున్న చోట గాని చోటు చేసుకుంటున్న వేధింపులు, అఘాయిత్యాలపై ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకు ఉమెన్ హెల్ప్ లైన్ ఉంటుంది. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా జరిగిన ఘటనను బట్టి వెంటనే అది భరోసా కేంద్రానికి పంపిస్తారు. కేసు నమోదు చేసి మహిళా పోలీసులు బాధితులతో మాట్లాడుతారు. వారికి కావాల్సిన వైద్య, ఆరోగ్య పరమైన సేవలు అందించేందుకు మెడికల్ విభాగం ఉంటుంది. వారికి నిష్ణాతులైన వారిచే కౌన్సెలింగ్ ఇప్పించేందుకు కౌన్సెలర్ల బృందం ఉంటుంది. బాధితులలో మనో ధైరాన్ని పెంపొందించేందుకు వారు ప్రయత్నిస్తారు. వారికి అవసరమైన న్యాయపరమైన సేవలు అందించేందుకు న్యాయసేవల విభాగం ఉంటుంది. బాధితులకు పునరావాసం కల్పించే చర్యలు కూడా తీసుకుంటారు. బాధితులు కోర్టుకు వెళ్లలేని పరిస్థితులలో నేరుగా వీడియో కాన్ఫరెన్స్లోనే కోర్టుకు తమ బాధను చెప్పుకోవడానికి వీడియో సౌకర్యం కూడా ఉంది. బాధితులు ఇక్కడకు వచ్చిన తరువాత ఎక్కడకు వెళ్లాల్సిన పనిలేదు. కోర్టుకు కూడా వీడియో కాన్ఫరెన్స్లోనే హాజరు కావాల్సి ఉంటుంది.