హైదరాబాద్: బంజారాహిల్స్లోని పబ్లో డ్రగ్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్ ఏసీపీ, సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నది. పోలీస్ స్టేషన్ సీఐ శివచంద్రను స్పస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్కు చార్చ్మెమో జారీచేశారు. పబ్పై గతంలో ఫిర్యాదులు అందినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్పై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడిచేశారు. హోటల్లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పబ్లో కొకైన్, గంజాయి, ఎల్ఎస్డీ వినియోగించినట్లు గుర్తించారు. దీంతో పబ్ యజమాని సహా 150 మంది అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. అయితే నటి నిహారికకు నోటీసులు ఇచ్చిన పోలీసులు, ఆమెను ఇంటికి పంపించారు. కాగా, పబ్లో మరికొందరు ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తున్నది. వివరాలు నమోదుచేసుకుని వారిని వదిలేశారు.
పబ్కు డ్రగ్స్ సరఫరాపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పబ్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో పరిశీలిస్తున్నారు. అందులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.