రామంతాపూర్, నవంబర్ 16 : అధికారం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తానని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ మేరకు గురు వారం హబ్సిగూడ డివిజన్లోని వీధినంబర్ 1 లో పాద యాత్ర చేపట్టి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఇంటింటా తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. అహర్నిషలు కష్టపడి ముఖ్యమంత్రి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ఆయనకు మనందరం మద్దతు తెలుపాలన్నారు. ఉప్పల్ నియోజక వర్గాన్ని అన్నిరంగా ల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఈ పాదయాత్రలో బండారి లక్ష్మారెడ్డికి ప్రజలు మంగళ హారతులతో స్వాగతం ప లికారు. కార్యక్రమంలో నాయకులు కైలాస్పతి గౌడ్, డి విజన్ అధ్యక్షుడు డాక్టర్ బీవీ చారి, యాదగిరి, పాలకూర సరితాగౌడ్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
చర్లపల్లి, నవంబర్ 16 : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చర్లపల్లి డివిజన్ కార్పొరే టర్ బొంతు శ్రీదేవి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని నాగార్జుననగర్ కాలనీ, బీఎన్రెడ్డినగర్, ఈసీనగర్ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారె డ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..చర్లపల్లి డివిజన్లో చేపడుతున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని, బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ అందించేందుకు డివిజన్లో ప్రచారంను ము మ్మరం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకు లు నాగిళ్ల బాల్రెడ్డి, నేమూరి మహేశ్గౌడ్, కనకరాజు గౌడ్, పాండాల శివకుమార్గౌడ్, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, జాన్రెడ్డి, సారా అనిల్, శ్రీకాంత్రెడ్డి, సురేశ్రెడ్డి, సానెం రాజుగౌడ్, రాజేశ్ వంశరాజు, జయ కృష్ణ, చల్లా వెంకటేశ్, కడియాల శ్రావణ్కుమార్, లక్ష్మా రెడ్డి, కుచ్చర్ల రాజు, కొమ్ము సురేశ్, కడియాల బాబు, కొమ్ము రమేశ్, సానెం రాజుగౌడ్, శ్రీకాంత్రెడ్డి, సుభాష్, మురళి, తన్వీర్, వెంకట్రెడ్డి, నజీర్, పుష్పలత, అలీ, బాల్నర్సింహా, నవనీత, సత్తెమ్మ, లలిత, సోమయ్య, ముత్యాలు, శ్రీనివాస్తో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు.
మల్లాపూర్, నవంబర్ 16 : ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి ల క్ష్మారెడ్డిని మల్లాపూర్ డివిజన్ నుంచి అ త్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్నగర్, దత్తాత్రేయనగర్, మల్లికార్జుననగర్ కాలనీల లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కర పత్రాలను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కా లనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్పేట్ హెచ్బీ కా లనీ డివిజన్ పరిధిలోని ఫేజ్-1లో బీఆర్ఎస్ నాయ కులతో కలిసి కార్పొరేటర్ జె. ప్రభుదాస్, మాజీ కార్పొరే టర్ జి. శ్రీనివాస్రెడ్డిలు గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో, అభివృద్ధి సంక్షేమ పథకాల కర పత్రాలను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకో వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకు లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.