హైదరాబాద్లో టెర్రస్ గార్డెన్ కల్చర్
ప్రోత్సహిస్తున్న ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్’
– 24 వేల మందితో ఫేస్బుక్ గ్రూపు
ఫౌండర్ శ్రీనివాస్ హర్కర ప్రత్యేక కృషి
హైదరాబాద్, మార్చి 30 : హైదరాబాద్లో మిద్దె తోటల పెంపకం ఎక్కువవుతున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు పలు సంస్థల సహకారంతో నగరంలోని దాదాపు 25 వేల గృహాల్లో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. ఇందులో ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ ఫేస్బుక్ గ్రూప్ పాత్ర ప్రత్యేకమైనది. ఈ గ్రూప్ను న్యాయవాది శ్రీనివాస్ హర్కర ఏర్పాటు చేసి, టెర్రస్ గార్డెన్పై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రూప్లో 24 వేల మంది ఉన్నారు. వీరంతా మిద్దతోటలపై అవగాహన పెంచుకొంటున్నారు. కొత్త విత్తనాలు, సేంద్రియ ఎరువులు దొరికే చిరునామాలు, సాంకేతిక నిపుణులు, సలహాదారుల వివరాలు గ్రూప్లో అందుబాటులో ఉంటాయి. మొకల్లో ప్రవర్ధనం, సేంద్రియ ఎరువులు వాడకం, పూత సమయాన్ని గుర్తించడం, కాయ నాణ్యత, దిగుబడులు పెంచడంలో కావలసిన సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు ఈ గ్రూపులో చర్చించుకొంటారు. గ్రూప్లోని దాదాపు 90 శాతం మంది మహిళలు కావటం గమనార్హం. భవిష్యత్ తరాలకు సేంద్రియ ఎరువులతో పెంచిన స్వచ్ఛమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో గ్రూప్ను స్థాపించినట్టు శ్రీనివాస్ హర్కర తెలిపారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ద్వారా.. అంటు కట్టిన మిరప, టమాట, వంకాయ మొకలు రూ.6కే డోర్ డెలివరీ చేస్తున్నామని, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి సహకారంతో సబ్సిడీపై రూ2 కే కిలో కంపోస్టు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.