Balanagar FlyOver | సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ) : భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బాలానగర్లోని ఫ్లైఓవర్కు ఆయన గౌరవార్థంగా బాబు జగ్జీవన్ రామ్ పేరుతో నామకరణం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోని సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప నాయకుడి సేవలు భావితరాలకు తెలిసి, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది.