ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ గురువారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మహా మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ కవిత, చిత్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పూర్ణాహుతి నిర్వహిస్తున్న పండితులుఅమీర్పేట్, ఫిబ్రవరి 17 : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ బల్కంపేట ఎలమ్మ ఆలయంలో గురువారం మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఆమె… దాతలు సమకూర్చిన బంగారు జడ, పాదాలు, కాసుల పేరును మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఈవో ఎస్.అన్నపూర్ణలతో పాటు పాలకమండలి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
గురుద్వారా ప్రబంధక్ కమిటీ అమీర్పేట్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం గురుద్వారా సమీపంలో మన్మీత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య పరీక్ష శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. చక్కటి సేవా భావంతో మన్మీత్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వైద్య సేవలను కొనియాడుతూ నిర్వాహకులు సర్దార్ కుల్వంత్సింగ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, తెలంగాణ మైనార్టీ కమిషన్ మాజీ సభ్యులు సర్దార్ సురిందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
అమీర్పేట్, ఫిబ్రవరి 17 : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ బల్కంపేట ఎలమ్మ ఆలయంలో గురువారం మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఆమె… దాతలు సమకూర్చిన బంగారు జడ, పాదాలు, కాసుల పేరును మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఈవో ఎస్.అన్నపూర్ణలతో పాటు పాలకమండలి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
గురుద్వారా ప్రబంధక్ కమిటీ అమీర్పేట్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం గురుద్వారా సమీపంలో మన్మీత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య పరీక్ష శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. చక్కటి సేవా భావంతో మన్మీత్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వైద్య సేవలను కొనియాడుతూ నిర్వాహకులు సర్దార్ కుల్వంత్సింగ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, తెలంగాణ మైనార్టీ కమిషన్ మాజీ సభ్యులు సర్దార్ సురిందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.