సైదాబాద్/బండ్లగూడ/మణికొండ/చాదర్ఘాట్, డిసెంబర్ 26 : ప్రజా పాలనలో భాగంగా ఆరు గ్యారంటీలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణలో అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని మలక్పేట నియోజకవర్గం నోడల్ అధికారి కృష్ణ తెలిపారు. మంగళవారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్బీహెచ్ పద్మావతి కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రజా పాలన- ఆరు గ్యారంటీల అమలుపై జీహెచ్ఎంసీ సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధిలోని ప్రతి డివిజన్లో 4కేంద్రాల చొప్పున 6 డివిజన్లకు కలిపి 28 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డివిజన్ల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసే ప్రదేశాలను గుర్తించి అధికారులను నియమించామని, నియామకమైన అన్ని బృందాలు సక్రమంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి డివిజన్ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వార్డు ఆఫీసులు, కమ్యూనిటీ హాళ్లు, మల్టీపర్సస్, ఫంక్షన్హాళ్లు, ఇతరత్రా భవనాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక బృందాలకు చెందిన సభ్యులు ఇంటింటికీ వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు దరఖాస్తులను అందజేయాలన్నారు. అదే విధంగా దరఖాస్తులను స్వయం సహాయక సభ్యులు ఇంటి వద్దకు వచ్చి స్వీకరించి, వాటికి సంబంధించిన రసీదు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎస్.జయంత్, యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
బండ్లగూడ: ప్రజా పాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రవికుమార్ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ అదేశాల మేరకు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో డివిజన్ల వారీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అభయ హస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్లలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు, ప్రతి వార్డు కార్యాలయంలో ఒక కౌంటర్ ఉం టుందని, మిగితా మూడు కౌంటర్లు డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ప్రజా పాలన కార్యక్రమానికి రాజేంద్రనగర్ సర్కిల్కు మంగతాయారును నియమించారన్నారు. ఈఈ నరేందర్గౌడ్, ఏసీపీ కృష్ణ మోహన్, డీపీవో రాధారాణి తదితరులు పాల్గొన్నారు.
మణికొండ : సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నార్సింగి మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ జి.శివారెడ్డి తెలిపారు. కోకాపేట్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల నమోదు ప్రక్రియ కోసం ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్నామన్నారు. కోకాపేట్ కమ్యూనిటీహాల్లో ఆధార్కార్డు, రేషన్కార్డు, పాస్ ఫొటోలతో వచ్చి కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చాదర్ఘాట్: మలక్పేట నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్గా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(అర్బన్ బయో డైవర్సిటీ)వీ.కృష్ణ నియమితులయ్యారు. నియోజకవర్గంలో ప్రజాపాలన కేంద్రాల అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మలక్పేట సర్కిల్ పరిధిలోని ఏడు డివిజన్లలో 4 సెంటర్ల చొప్పున మొత్తం 28కేంద్రాల్లో ఐదు గ్యారంటీ స్కీం దరఖాస్తులను స్వీకరించనున్నారు. సైదాబాద్, ముసరాంబాగ్, పాతమలక్పేట, అక్బర్బాగ్, ఆజంపురా, చావునీ, డబీర్పురా డివిజన్ల వారీగా నాలుగేసి సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సైదాబాద్ డివిజన్ పరిధి : సైదాబాద్ డివిజన్ వార్డు ఆఫీస్, జాకీరు హుస్సెన్ కాలనీ కమ్యూనిటీ హాల్, ఆస్మాన్ఘడ్ గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, మూడు గుళ్లు జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్.
మూసారాంబాగ్ డివిజన్ పరిధి : మూసారాంబాగ్ వార్డు ఆఫీస్, ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్, మూసారాంబాగ్ రజక సంఘం హాల్, గడ్డి అన్నారం రాజీవ్ కమ్యూనిటీ హాల్.
అక్బర్బాగ్ డివిజన్ పరిధి : ఆనంద్నగర్ కమ్యూనిటీ హాల్, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వెనుక జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్, బకార్ బాగ్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్, పల్టన్ కమ్యూనిటీ హాల్.
పాత మలక్పేట డివిజన్ పరిధి: ప్రిన్స్ బాడీగార్డ్ కమ్యూనిటీ హాల్, సలార్ ఇ-మిల్లత్ కమ్యూనిటీ హాల్ వాటర్ ట్యాంక్ వద్ద, శంకర్నగర్ అంబేద్కర్ కమ్యూనిటీహాల్, అప్జల్నగర్ సలార్ మిల్లత్ కమ్యూనిటీ హాల్.
అజంపురా డివిజన్ పరిధి : అజంపురా వార్డు ఆఫీస్, సోహెబ్ మెమోరియల్ లైబ్రరీ హాల్, కాలడేరా కమ్యూనిటీ హాల్, కమల్నగర్ కమ్యూనిటీ హాల్.
చావునీ డివిజన్ పరిధి : చావునీ వార్డు ఆఫీస్, గుడ్డిబౌలి కమ్యూనిటీ హాల్, ఫ్రీన్స్ దురిస్సెవర్ గ్లల్స్, చంచల్గూడ జూనియర్ కాలేజ్, డబిర్పురా వార్డు ఆఫీస్లో దరఖాస్తు స్వీకరణకు కౌంటర్లను ఏర్పాటు చేశారు.