అమీర్పేట్, ఫిబ్రవరి 27: ఈఎస్ఐసీ 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభ చాటుతున్న ఈఎస్ఐసీ వైద్య కళాశాలలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పోటీల్లో సనత్నగర్ ఈఎస్ఐసీ ద్వితీయ స్థానంతో రన్నరప్గా నిలిచింది. ఈ మేరకు ఫిబ్రవరి 24న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా ఈ రన్నరప్ షీల్డ్ను సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల డీన్ డాక్టర్ మాధురి శ్రీష్ కాటే అందుకున్నారు. మంగళవారం సనత్నగర్ ఈఎస్ఐసీలో జరిగిన ఓ కార్యక్రమంలో సనత్నగర్ ఈఎస్ఐసీ సాధించిన రన్నరప్ షీల్డ్ వివరాలను డీన్ డాక్టర్ మాధురి కాటే వివరించారు.