హైదరాబాద్ : హిమాయత్ సాగర్లో ఈతకు వెళ్లి ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు ఆటో డ్రైవర్ దేవాగా గుర్తించారు.
రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి ఎవరు కూడా ఈతకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.