చాదర్ఘాట్, సెప్టెంబర్ 14: బధిర (మూగ, చెవిటి) సమస్యతో బాధపడుతున్న చిన్నారుల కోసం మలక్పేటలోని నల్లగొండ చౌరస్తాలోని డిసేబుల్డ్ జాతీయ పార్కులో ఏఈఎస్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆడియాలజీ ల్యాబ్ త్వరలో ప్రారంభం కానున్నది. సౌండ్ ఫ్రూఫింగ్ విధానంతో దాదాపు రూ.10 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఈ కేంద్రంలో ఇంపిడెన్స్ ఆడియో మీటర్, టింపానో మీటర్ వంటి పరికరాలను అమర్చారు. వీటి ద్వారా వినికిడి లోపం ఉన్న చిన్నారులకు పరీక్ష నిర్వహించనున్నట్లు థెరపీ సెంటర్ ఇన్చార్జి డాక్టర్ సుమేరియా తెలిపారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవ తేదీని ఏఈఎస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఖరారు చేయనున్నారు.