మహిళా ప్రజా ప్రతినిధి,వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి అమానుషం.పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఏనాడూ రౌడీయిజం, గుండాలను ప్రోత్సహించలేదు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేసింది.
కొత్తగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన ఈ మూడు నెలల్లోనే ఇంతటి దౌర్జన్యానికి పాల్పడ్డారు. కాంగ్రెస్ గుండాగిరికి ఇది పరాకాష్ట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.