ఆసియా గేమ్స్ను ఆసియాడ్ క్రీడలు అని కూడా అంటారు. ఒలింపిక్స్ తర్వాత అతి పెద్ద బహుళ క్రీడా ఈవెంట్గా ఆసియా గేమ్స్ను పరిగణిస్తారు. ఈ క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఆసియా ఖండానికి సంబంధించిన దేశాలు మాత్రమే పాల్గొంటాయి. ప్రారంభంలో ఈ క్రీడలను ఆసియా క్రీడల సమాఖ్య నిర్వహించేది. ప్రస్తుతం ఈ క్రీడలను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నిర్వహిస్తుంది.
భారత్కు తొలి స్వర్ణం: 10 మీ.ఎయిర్ రైఫిల్ 1893.7 స్కోర్ చేసి స్వర్ణం సాధించారు. రుద్రాంక్ష, ఐశ్వరీ ప్రతాప్, దివ్యాంశ్ సింగ్.
మహిళల 25 మీ పిస్టల్ ర్యాపిడ్ విభాగం: ఇషాసింగ్ 25 మీటర్ల పిస్టల్లో టీమ్ మను బాకర్, రిథమ్ సంగ్వాన్తో కలిసి ఇషా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం స్కోర్ 1759. ద్వితీయ, తృతీయ స్థానాల్లో చైనా, దక్షిణ కొరియాలకు రజత, కాంస్యాలు దక్కాయి.
మహిళల 50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్ : యువ షూటర్ సమ్రా సిఫ్ద్ కౌర్ మహిళల 50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్లో ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. ఈ విభాగంలో పసిడి నెగ్గిన తొలి భారత షూటర్ ఈమె.
50మీ. రైఫిల్ త్రీ పొజిషన్ టీం : ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుసాలే, అఖిల్ షెరాన్ లతో కూడిన జట్టు 1769 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణాన్ని సాధించినది. చైనా రజతంతో సరిపెట్టుకుంది.
10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ : భారత యువ షూటర్లు సరభ్ జోత్ సింగ్, అర్జున్ సింగ్, శివనర్వాల త్రయం 1734 పాయింట్లతో స్వర్ణం సాధించారు.
మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం: యువ షూటర్ పాలక్ గులియా 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 242.1 పాయింట్లు సాధించి పసిడి పతకం గెలుచుకుంది. హైదరాబాద్ యువ షూటర్ ఇషాసింగ్ రజతాన్ని సాధించినది.
పురుషుల ట్రాప్ టీమ్ విభాగం : హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్, పృథ్వీరాజ్ తొండమాన్, జొరావర్ సింగ్ సంధూలతో కూడిన త్రయం స్వర్ణం సాధించింది.
3000 మీ. స్టీపుల్ చేజ్ : 3000 మీ. స్టీపుల్ చేజ్లో అవినాష్ సాబ్లే స్వర్ణాన్ని సాధించాడు. తొలిసారి ఆసియన్ క్రీడల చరిత్రలో ఛాంపియన్గా అవతరించాడు. (8 నిమిషాల 19.50 సెకన్లలో గమ్యాన్ని చేరి పతకాన్ని సాధించాడు).
షాట్పుట్: పురుషుల షాట్పుట్లో తజీందర్ పాల్ సింగ్ తూర్ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈయన 20.36మీ. విసిరి రెండోసారి ఆసియా క్రీడల ఛాంపియన్గా అవతరించాడు.
మహిళల 5000 మీ పరుగు : పారుల్ చౌధరి పసిడి పతకాన్ని సాధించింది.
పురుషుల 4400 రిలే : డిఫెండింగ్ ఛాంపియన్ భారత పురుషుల జట్టు వరుసగా రెండో పసిడి సాధించింది. ఈ జట్టులో మహ్మద్ అజ్ముల్, రాజేష్, రమేష్ల బృందం 3:01.58 సెకన్లలో స్వర్ణాన్ని సాధించింది.
పురుషుల జావెలిన్ త్రో : నీరజ్ చోప్రా స్వర్ణం (88.8మీ) సాధించగా, కిశోర్ కుమార్ (ఒడిశా) 87.54మీ రజతం సాధించారు. నీరజ్ చోప్రా వరుసగా రెండోసారి స్వర్ణం సాధించారు.
మహిళల జావెలిన్ త్రో : అన్నూరాణి జావెలిన్ త్రోలో 62.92 మీ విసిరి స్వర్ణం సాధించింది.
ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ : ఓజాస్ ప్రవీణ్తో కలిసి తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ స్వర్ణం సాధించింది. ఈ జట్టు రెండో సీడ్ చెవాన్ జేహూన్ (దక్షిణ కొరియా)లను ఓడించి రజతానికి పరిమితం చేశారు.
ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ : జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీకౌర్లతో కూడిన బృందం 230-229 తేడాతో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
ఆర్చరీ కాంపౌండ్ పురుషుల టీమ్ : ఓజాస్ ప్రవీణ్, అభిషేక్ వర్మ, ప్రథమేష్లతో కూడిన జట్టు 235-230 తో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణాన్ని గెలుచుకుంది.
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఆర్చరీ : టాప్ సీడ్ జ్యోతి సురేఖ 149-145 తేడాతో రెండో సీడ్ చేవాన్ (దక్షిణ కొరియా) పై నెగ్గి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఇదే క్రీడల్లో వెన్నం జ్యోతి సురేఖ మిక్స్డ్, మహిళల టీమ్ బంగారు పతకాలను కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించింది.
ప్రపంచ ఛాంపియన్ ఓజాస్ ప్రవీణ్ డియోతలే 149-147తో సీనియర్ అభిషేక్ వర్మను ఓడించి స్వర్ణాన్ని సాధించాడు. పురుషుల టీమ్, మిక్స్డ్లో స్వర్ణాలు గెలిచిన ఓజాస్కు ఇది మూడో స్వర్ణం. ఈసారి మూడు స్వర్ణాలతో హ్యాట్రిక్ సాధించి ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
పురుషుల కబడ్డీ : డిఫెండింగ్ ఛాంపియన్ ఇరాన్ను 33-29 తేడాతో ఓడించి పురుషుల కబడ్డీ విభాగంలో 8వ సారి భారత్ స్వర్ణాన్ని గెలుచుకుంది. 1990లో ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా ఏడు సార్లు స్వర్ణాన్ని సాధించిన భారత్ కబడ్డీ జట్టు 2018లో ఇరాన్ చేతిలో సెమీస్లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. భారత్ కెప్టెన్ పవన్ నెహ్రావత్.
మహిళల కబడ్డీ : మహిళల జట్టు చైనీస్ తైపీని 26-25తో ఓడించి మూడోసారి పసిడి సాధించింది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య 100కు చేరుకుంది. కబడ్డీలో 2010, 2014లో స్వర్ణాలు, 2018లో రజతాన్ని మహిళల జట్టు గెలుచుకుంది.
పురుషుల క్రికెట్ : టాప్ సీడ్ ఆధారంగా భారత్ విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది. ఈ జట్టులో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ సభ్యుడిగా ఉన్నాడు. రజతం విజేత అఫ్గానిస్థాన్.
ఈక్వేస్ట్రియన్ : 41 ఏళ్ల తర్వాత ఈక్వేస్ట్రియన్లో భారత్కు స్వర్ణం లభించింది. సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్, విపుల్ హృదయ్, అనూష అగర్వాల్తో కూడిన బృందం డ్రెసెజ్ విభాగంలో పసిడి సాధించింది.
బ్యాడ్మింటన్ డబుల్స్: సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడి చో సోగ్యూ-కిమ్ వాన్ హో దక్షిణ కొరియా జట్టును ఓడించి స్వర్ణాన్ని గెలుచుకుంది. 1982 (లెరోయ్ ప్రదీప్ కాంస్యం) తర్వాత పురుషుల డబుల్స్లో భారత్కు దక్కిన తొలి ఆసియా క్రీడల పతకమిదే. 2018 ఆసియా క్రీడల్లో ఓ రజతం, కాంస్యం గెలుచుకుంది.
స్క్వాష్ టీమ్: సౌరవ్ గోషల్, మహేశ్ మంగోనకర్, హరీందర్పాల్ సంధూ, అభయ్సింగ్లతో కూడిన జట్టు పాకిస్థాన్ జట్టుపై విజయం నమోదు చేసింది.
– అనంతారపు కృష్ణయ్య, డైరెక్టర్, శ్రీసాయి కోచింగ్ సెంటర్, కోదాడ, 9948750605