సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్లతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనులు చేపడుతున్నారు. ఈ మేరకు విడతల వారీగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దుర్గం చెరువు ఎస్టీపీ (7 ఎంఎల్డి సామర్థ్యం) వందశాతం పనులు పూర్తి చేసుకొని రెండు నెలలుగా ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ నెలాఖరులోగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 31 ఎస్టీపీల్లో తొలి ఫలితం దుర్గం చెరువు కావడం, తర్వాతి దశలో కోకాపేట 15 ఎంఎల్డీను అందుబాటులోకి తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. రూ. 33.67కోట్లతో 15 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్బీఆర్ టెక్నాలజీతో ఈ నిర్మాణ కేంద్రాన్ని చేపడుతున్నారు. 96 శాతం పనులు పూర్తి చేసుకోగా.. వచ్చే నెల 5వ తేదీ నాటికల్లా ప్రారంభానికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 14 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఇంటరాప్షన్ అండ్ డైవర్షన్ పనులు చేపడుతున్నారు. వట్టినాగులపల్లి, తేజ్నగర్, జర్నలిస్టు కాలనీ, గౌలిదొడ్డి, ఐఎస్బీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కాంపెనీలు విప్రో, మైక్రోసాఫ్ట్ తదితర ప్రాంతాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. మెట్రో నగరాల్లో స్థలాభావం ఉంటుంది గనుక ఎస్బీఆర్ టెక్నాలజీతో నిర్మాణం అనువుగా ఉంటుంది. వీటి వల్ల ఒకే ఛాంబర్లో ఐదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరిగి.. తకువ విస్తీర్ణంలో ఎకువ నీటిని శుద్ధి చేస్తాయి. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్ ట్రీట్మెంట్ పద్ధతుల కంటే ఈ ఎస్బీఆర్ విధానానికి తకువ ఖర్చు అవడంతో పాటు మెరుగ్గా మురుగునీటి శుద్ధి జరుగుతుంది. ఇది తేలికైన విధానం. దీనికి విద్యుత్తు వినియోగం కూడా తకువగా ఉంటుంది.