కీసర, ఫిబ్రవరి 20: కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గర్భగుడిలోని శ్రీ మూలవిరాట్స్వామివారికి వేదపండితులు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకొన్నారు. అక్కడి నుంచి నేరుగా శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు.
కీసరగుట్టలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి విమానరథోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారిని బ్యాండ్ మేళాలతో పోలీసుబందోబస్తు మధ్య ఊరేగింపు నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ తటాకం రమేశ్శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డితో పాటు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు నారాయణశర్మ, టి. వెంకటేశ్, టి. ఉమాపతి, నాగలింగంశర్మ, శ్రీనివాస్శర్మ, ఆల య ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామలింగేశ్వరస్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య శివుడికి అన్నాభిషేకాన్ని నిర్వహించారు.
శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. చివరి రోజు స్వామివావారికి గర్భగుడిలో ఉదయం 5.30గంటలకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, కల్యాణ మండపంలో సామూహిక అభిషేకం, ఉదయం 7గంటలకు రుద్రస్వాహాకార హోమం, ఉదయం 10గంటలకు క్షేత్రదిబ్బలి, పూర్ణాహుతి, తీర్థ్థప్రసాదం, ఉత్సవ సమాప్తి, పండిత సన్మానం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీసరగుట్టలో సోమవారం యూత్ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడోత్సవాలను జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభించారు. కబడ్డీలో 35 టీంలు, వాలీబాల్లో35టీంలు, ఖో-ఖోలో 31 టీంలు పాల్గొన్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 16, 17 తేదీల్లో విద్యార్థులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతల వివరాలను డీఈవో విజయలక్ష్మి ప్రకటించారు. వాలీబాల్ బా లుర విభాగంలోజడ్పీహెచ్ఎస్ ఏదులాబాద్ ప్రథమ బ హుమతి, జడ్పీహెఎచ్ఎస్ కీసర ద్వితీయ బహుమతి, వాలీబాల్ బాలికల విభాగంలో జడ్పీహెచ్ఎస్ ఉప్పల్ ప్రథమ, విజేత హైస్కూల్ ద్వితీయ, ఖో-ఖో బాలుర విభాగంలో ప్రథమ,అలియాబాద్ ప్రథమ, జడ్పీహెఎచ్ఎస్ తూంకుంట ద్వితీయ, ఖో-ఖో బాలికల విభాగంలో జడ్పీహెఎచ్ఎస్ ఉప్పల్ ప్రథమ,జడ్పీహెఎచ్ఎస్ అలియాబాద్ ద్వితీయ, కబడ్డీ బాలుర విభాగంలో కీసర సెరినిటీ పాఠశాల ప్రథమ బహుమతి, సాయివాణి హైస్కూల్ జోడిమెట్ల ద్వితీయ బహుమతి, కబడ్డీ బాలికల విభాగంలో సెరినిటీ హైస్కూల్ కీసర ప్రథమ బహుమతి, జడ్పీహెఎచ్ఎస్ జోడిమెట్ల ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు.