హైదరాబాద్ : సెల్ఫోన్ టవర్లే(Cell phone towers) లక్ష్యంగా దొంగతనాలకు(thefts) పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్(Arrest )చేశారు. సెల్ టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు, హెడ్స్ చోరీ చేస్తున్న 9 మంది సభ్యుల ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 60 లక్షల విలువైన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.