సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ) : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 11వ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ రీ యూనియన్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన ఆర్మీ మైక్రోలైట్ ఎక్స్పెడిషన్ బృందం యాత్ర సుమారు 17 రోజుల్లో 5వేల కి.మీటర్లు దాటింది. ఆదివారం ఉదయం 10.45 గంటలకు హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నట్లు తెలిపారు.
ఈ యాత్రలో కల్నల్ ఎల్కే యాదవ్, టీమ్ లీడర్, కల్నల్ రాహుల్ మంకోటియా, ఎల్టీ కల్నల్ బీపీ సింగ్, హెచ్ఏవీ హెచ్సీ జోషి, ఎస్ ఈపీ రాప్ కేష్, ఎస్ ఈపీ సోరెన్, హెచ్ ఏవీ ధర్మేంద్ర, హెచ్ ఏవీ సర్వే, ఎన్కే ప్రదీప్, ఎన్కే విజయ్, పైలట్లు పాల్గొన్నారు.