నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మలయాళ సొగసరి నజ్రియా నజీమ్ కథానాయికగా తెలుగుచిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. సోమవారం నుంచి ఆమె ఈ సినిమా చిత్రీకరణలో భాగమైంది. ‘తొలి అనుభూతి ఎప్పుడూ ప్రత్యేకమే. ‘అంటే సుందరానికి’ నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్గా నిలుస్తుంది. ఈ రోజు నుంచి సినిమా చిత్రీకరణను మొదలుపెట్టాను’ అంటూ సోషల్మీడియా ద్వారా నజ్రియా నజీమ్ వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్లో కథానాయికతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి.