హైదరాబాద్ : హైదరాబాద్ పరిసరాల్లోని బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కొనుగోలు కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని ఫ్లాట్ల కోసం 33,161 మంది దరఖాస్తు చేసుకోగా, పోచారం ఫ్లాట్ల కోసం 5,921 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 27 నుంచి జులై 1వ తేదీ వరకు ఫ్లాట్ల కేటాయింపు జరగనుంది. దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయించనున్నారు. మొదట బండ్లగూడ, ఆ తర్వాత పోచారం ఫ్లాట్లను కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.