కాచిగూడ, జూన్ 4 : నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఫైర్, సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్ రెడ్డి తెలిపారు.
బుధవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పేరొందిన ఎయిర్ పోర్టు, ఆయిల్ కంపెనీలు, గ్యాస్ ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్, ఫార్మా ఇండస్ట్రీస్, రైల్వే, వివిధ కార్పొరేట్ సంస్థలలో ఎన్నో అవకాశాలు పొందవచ్చని వెల్లడించారు. ఈ కోర్సులలో చేరేందుకు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ అభ్యర్థులను అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తిగల యువతీయువకులు ఈనెల 21వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు www.ncttindia.com లేదా 6302355872లో సంప్రదించాలని కోరారు.