కాచిగూడ,ఆగస్టు 26 : నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఫైర్,సేఫ్టీ కోర్సులకు(Fire Safety Courses )అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను(Applications) కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి తెలిపారు. సోమవారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పేరొందిన ఎయిర్పోర్ట్, అయిల్ కంపెనీలు, గ్యాస్ ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్, ఫార్మా ఇండస్ట్రీస్, రైల్వే, వివిధ కార్పొరేట్ సంస్థలలో అవకాశాలు పొందవచ్చని వెల్లడించారు.ఈ కోర్సులలో చేరేందుకు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల యువకులు వచ్చే నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు www.ncttindia.com. లేదా 6302355872లో సంప్రదించాలని సూచించారు.