Hyderabad | హైదరాబాద్లోని సాగరతీరంలో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసును ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వీక్షించారు. ఈ సందర్భంగా రేస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ఆయన మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమని కొనియాడారు. తెలుగు ప్రజలు కలిసి నిర్మించిన నగరం.. హైదరాబాద్ అని అన్నారు.
ఫార్ములా రేసు నిర్వహించే దిశగా ఏపీని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఏపీ మంత్రి అమర్నాథ్ తెలిపారు. విశాఖను హైదరాబాద్ నగరం తరహాలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కాగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఫార్ములా ఈ కారు రేసులో భాగంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. ఈ రేసులో 11 టీమ్లు 22 మంది డ్రైవర్లు పోటీపడగా.. జీన్ ఎరిక్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. వీరికి మంత్రి కేటీఆర్ బహుమతులు అందజేశారు.