Anurag University | సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): అనురాగ్ యూనివర్సిటీలో 2024-2025 విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం వ చ్చే నెల ఫిబ్రవరి 11 నుంచి నిర్వహించే అనురాగ్ సెట్-2024 ప్రవేశ పరీక్షలో మెరిట్ సా ధించిన వారికే తమ యూనివర్సిటీలో సీట్లు తప్పకుండా వస్తాయని ఆ యూనివర్సిటీ సీఈ వో నీలిమా తెలిపారు. ఈ మేరకు అనురాగ్ వర్సిటీలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అనురాగ్ సెట్-2024 ప్రవేశ పరీక్ష షెడ్యూల్కు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు.
సీఈవో నీలిమా మాట్లాడుతూ, అనురాగ్ సెట్లో మొదటి 10 ర్యాంకులు సాధించిన వారికి వంద శాతం స్కాలర్షిప్లు పొందుతారని ప్రకటించారు. 11 నుంచి 25 ర్యాంకులోపు వారికి 50 శాతం, 26 నుంచి 100 లోపు ర్యాంకుల వారికి 25 శాతం ట్యూషన్ ఫీజులో మినహాయింపు ఇస్తామన్నారు. అలాగే ఎప్సెట్లో 1 నుంచి 10 వేల ర్యాంకర్లకు, జేఈఈలో 1 నుంచి 50 వే ల లోపు ర్యాంకర్లకు 50 శాతం ట్యూషన్ ఫీజు లో రాయితీ కల్పిస్తామన్నారు.
అనురాగ్సెట్-2024 ప్రవేశ పరీక్షకు వచ్చే నెల 11న నిర్వహిస్తున్నామని, ఈ సెట్కు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 10 వరకు గడువు విధించామన్నారు. అలాగే ప్రవేశ పరీక్షలను ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా నిర్వహిస్తామన్నా రు. మరిన్ని వివరాలకు www.anurag. edu.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.