హైదరాబాద్ : పోలీసుల సంక్షేమమే తమ లక్ష్యమని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. పెట్లబుర్జు పోలీసు శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను సీపీ సోమవారం పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన పోలీసుల కుటుంబాలను అంజనీ కుమార్ ఆప్యాయంగా పలుకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సిటీ పోలీసుల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా వైరస్ కట్టడి కోసం పోలీసులంతా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని సీపీ విజ్ఞప్తి చేశారు.