హైదరాబాద్, నవంబర్16(నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ క్యాంపస్లో ఇటీవల జరిగిన ర్యాగింగ్ కేసులో నిందితుడైన మైనర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో మైనర్ తల్లి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై బుధవారం జస్టిస్ కె.సురేందర్ విచారణ జరిపి.. పోలీసుల వివరణ నిమిత్తం విచారణ ను వాయిదా వేశారు.
ఐబీఎస్ విద్యా సంస్థలో ఒక విద్యార్థిని కొందరు విద్యార్థులు కలిసి ర్యాగింగ్కు పాల్పడటం, కొట్టడం, లైంగిక వేధింపులకు గురిచేయడం వంటి ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పది మంది విద్యార్థుల్లో ఒకరి వయసు 17ఏండ్లు. తన కుమారుడు మైనర్ అని, అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తల్లి హైకోర్టును ఆశ్రయించారు.