వెంగళరావునగర్ ఆగస్టు 17: అమీర్పేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం..అమీర్పేట లోని మైత్రీవిహార్ సమీపంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్ ఫుట్ పాత్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుcr వయస్సు 45 సంవత్సరాలు ఉండవచ్చునని, అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇతని వివరాల తెలిసిన వారు ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.