కుత్బుల్లాపూర్, డిసెంబర్ 22: ఒడిశా నుంచి పుణెకు హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 272 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్కు తరలించారు. మేడ్చల్ జోన్ డీసీపీ శబరీశ్ శుక్రవారం పేట్ బషీరాబాద్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మేడ్చల్ జోన్ ఎస్ఓటీ, శామీర్పేట పోలీసులు ఉమ్మడిగా చేపట్టిన తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది.
రెండు కార్లలో ఒడిశా నుంచి పుణెకు హైదరాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శామీర్పేట ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టి, నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో మహారాష్ట్రకు చెందిన యోగేశ్ రాయ్సింగ్(29), దినాకర్ నారలె(26), చరణ్లాలా సింధా(31), యోగిరాజ్ సంజయ్(23), చైతన్యతుహర్(19), రాహుల్ కంటిలాల్(19) ఉన్నారు. ప్రధాన నిందితులైన సంజు, అప్పలు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి ఎండు గంజాయితో రెండు కార్లు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.