జీడిమెట్ల, డిసెంబర్ 17: క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం కుత్బుల్లాపూర్ మండ లం గుర్తింపు పోందిన పాఠశాలల యజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో చింతల్లోని హెచ్ఎంటీ మైదానంలో ఏర్పాటు చేసిన ‘స్పోర్ట్స్ మీట్ 2022’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించి గాలిలోకి బెలూన్స్ వదిలారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలకు హెచ్ఎంటీ మైదానం ఇబ్బంది ఉందని రూ.6 కోట్లతో గాజులరామారంలో స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 10 ఏండ్ల తరువాత పెద్ద ఎత్తున్న స్పోర్ట్స్ మీట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల విద్యాధికారి వి.అంజనేయులు, అసోసియేషన్ చైర్మన్ శివయ్య, అధ్యక్ష కార్యదర్శులు వర ప్రసాద్, సి.హెచ్.మహేష్కుమార్, కోశాధికారి దయాకర్, ముఖ్య సలహదారులు ఎం.శ్రీనివాస్గౌడ్, మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు ఎస్.ఎన్.రెడ్డి, మల్లేశం, రవికుమార్, ముంతాజ్ అలీ, జావిద్ అలీ, చింతల మల్లేశం యాదవ్, నర్సింహులు, శశిరేఖ, అలీవేలు మంగ, సంగీత, వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్తో పాటు 77 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 17: అనుకున్న లక్ష్యసాధన దిశగా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ‘ఇగ్నైట్ ఐఏఎస్ కళాశాల’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఖేలో ఇగ్నైట్-22 స్పోర్ట్స్ మీట్’ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇగ్నైట్ ఐఏఎస్ కళాశాల విద్యార్థుల కల సకారం కోసం అందిస్తున్న స్ఫూర్తి అభినందనీయమని, విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, కౌన్సిలర్ డప్పు కిరణ్, కళాశాల చీప్ మెంటార్ ఎన్ఎస్.రెడ్డి, డైరెక్టర్ సీఎం ప్రకాశ్తో పాటు పార్టీ శ్రేణులు చింతల దేవేందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.