Blast At Narsingi | నగర పరిధిలోని నార్సింగిలో పేలుడు కలకలం సృష్టించింది. ఎన్సీసీ గేట్ వద్ద డిటోనేర్ల పేలుడుతో పెద్ద బండరాయి ఎగిరిపడింది. ఈ సమయంలో అక్కడే పని చేస్తున్న కృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. పేలుడుతో అక్కడ పని చేస్తున్న కార్మికులంతా భయంతో పరుగులు పెట్టారు. భారీ పేలుడు శబ్దానికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న మృతుని కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకొని కృష్ణ ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపించారు. సెల్లార్ తవ్వుతున్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో కాంట్రాక్టర్లు విఫలమయ్యారని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగడం ఇది నాలుగోసారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.