అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేకపోవడంతో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బోయిన్పల్లి మార్కెట్ సమీపంలోని అంబేద్కర్నగర్లో నివాసం ఉండే పోచయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు మంగళవారం రాత్రి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్కెట్ యార్డు చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యతో గంట పాటు అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది. దీంతో అంబులెన్స్లోనే పోచయ్య ప్రాణాలు పోయాయి. విషయం తెలుసుకున్న బస్తీవాసులు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
బోయిన్పల్లి సీఐ తిరుపతి రాజు నచ్చచెప్పడంతో బస్తీవాసులు ధర్నాను విరమించారు. కాగా, ఎమ్మెల్యే శ్రీగణేశ్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, బోయిన్పల్లి సీఐ తిరుపతిరాజు మార్కెట్యార్డు రోడ్డును పరిశీలించారు. కూరగాయల రిటైల్ దుకాణాలు క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలని దుకాణాదారులకు ఎమ్మెల్యే సూచించారు. అత్యవసర సేవలకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఏసీపీ శంకర్రాజను ఆదేశించారు. – కంటోన్మెంట్