గోల్నాక, ఏప్రిల్ 15: నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థానికులను వేదిస్తున్న డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం అంబర్పేట డివిజన్ ఆకాశ్నగర్లో రూ.13 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మహేశ్, సతీశ్, కుషాల్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జి.మల్లేశ్యాదవ్, నాయకులు యాసిన్, సతీశ్, దయాకర్, రాగుల ప్రవీణ్, జుబేర్, జాకీబాబు, తిరుపతి, నాగరాజు, బాబా, రవి, రఫీ, రంగు సతీశ్గౌడ్, పాక నర్సింగ్, శ్రీనివాస్, సతీం, జమీల్, హైమత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.