కాచిగూడ : ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని, పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించి ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
గురువారం కాచిగూడ డివిజన్ చెప్పల్బజార్, హరిమజీద్ లైన్లో రూ.8లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ నియోజ కవర్గ ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రధాన సమస్యగా మురుగు ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను ప్రధానంగా వేధిస్తున్న మురుగు సమస్య శాశ్విత పరిష్కారంతో పాటు రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర బీష్మాదేవ్, ఇన్చార్జి డాక్టర్ శిరీషాయాదవ్, తదితరులు పాల్గొన్నారు.