హైదరాబాద్ : నగరంలోని అంబర్పేట సీఐ సుధాకర్పై సస్పెన్షన్ వేటుపడింది. భూమి వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసగించినట్లు సీఐ సుధాకర్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ అనంతరం సుధాకర్ను వస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో సుధాకర్ను సీఐ సీవీ ఆనంద్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కందుకూరు మండల పరిధిలో ఓ భూమిని రూ.54 లక్షలకు ఇప్పిస్తానని సుధాకర్.. ఓ ఎన్ఆర్ఐకి చెప్పాడు. దీంతో అతను సుధాకర్ను నమ్మి పలు దఫాల్లో రూ.54 లక్షలు ఇచ్చాడు. ఇక ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తూ సస్పెండ్కు గురైన రాజేశ్ను ఎమ్మార్వోగా ఎన్ఆర్ఐకి పరిచయం చేశాడు సుధాకర్. రాజేశ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారని నమ్మబలికాడు. మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన ఎన్ఆర్ఐ వనస్థలపురీం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు, భూమికి సంబంధించిన వివరాలన్నింటినీ ఎన్ఆర్ఐ పోలీసులకు సమర్పించారు. ఆ వివరాలన్నీ పక్కాగా ఉండడంతో సుధాకర్, రాజేశ్ను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.