ఆమనగల్లు, ఫిబ్రవరి 9: ఆమనగల్లు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ పార్టీదే అని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి రజినిసాయిచంద్, రా్రష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. 5వ వార్డులో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పాపిశెట్టి రాముకు మద్దతుగా సోమవారం నిర్వహించిన ప్రచారంలో వారు పాల్గొని బీఆర్ఎస్ హయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి అవకాశం కల్పించారాని ఒకసారీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించలన్నారు. 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
