మియాపూర్ : పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యతో వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ( MLA Arekapudi Gandhi ) అన్నారు. ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేలా ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. వివేకానందనగర్ డివిజన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ , శుభోదయ కాలనీ, నవోదయ కాలనీలలో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలపై శుక్రవారం ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్లు, రంగారావు , కాలనీ వాసులతో తన నివాసంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్(Traffic) సమస్యలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సౌత్ ఇండియా మలుపు వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్య నెలకొంటున్నదని, ఫలితంగా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. వాణిజ్య దుకాణాల(Commercial Shops) వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా చూడాలని కోరారు. నవోదయ, శుభోదయ కాలనీలలో అవసరమైన చోట డివైడర్ల (Dividers)నిర్మాణాలను చేపట్టాలని, ట్రాఫిక్ మళ్లింపు పట్ల స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి బాధకరం
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) మృతి చెందటం అత్యంత బాధాకరమని, ఆమె మరణ వార్త తనను ఎంతో కలిచి వేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నందిత మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న నందిత అకాల మరణం అత్యంత విచారకరమని, తండ్రి ఆశయాలను కొనసాగించాలనుకున్న ఆమె మృతి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు.