వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 8 : క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా , రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాల ఆవరణలో అంతర కళాశాల స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో రాణించాలన్నారు.
క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల మానసిక, శారీరక శక్తి పెరగడంతో పాటు, సమగ్రత టీమ్ స్పిరిట్ , సాంఘిక బాధ్యతను తీసుకోవడం.. నాయకత్వ లక్షణాలు మెరుగు పడుతాయన్నారు. యోగా, మెడిటేషన్, క్రీడలు బో ధనలో తప్పని సరి కావాలని, 2023 జనవరి మూడో వారంలో అఖిల భారత వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల మధ్య సాంస్కృతిక పోటీలు కర్ణాటకలోని యూనివర్సిటీ ఆఫ్అగ్రి కల్చర్ సైన్సెస్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
హర్యానాలోని చౌదరీచరణ్సింగ్ హర్యానా అగ్రికల్చర్ వర్సిటీలో క్రీడలు జరగనున్నాయని తెలిపారు. రాజేంద్రనగర్, మోజర్ల ఉద్యాన కళాశాల నుంచి 57 మంది విద్యార్థులు, 67 మంది విద్యార్థినులు , 38 క్రీడల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ హార్టికల్చర్ డీన్ కిరణ్కుమార్, రాజేంద్రనగర్ కళాశాల అసోసియేట్ డీన్ ప్రశాంత్, డీన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.