గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు గురువారం ప్రారంభమయ్యాయి. భక్తులు ఎల్లమ్మకు తొలిబోనాన్ని సమర్పించి.. పూజలు చేశారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. చిత్రంలో అంబారీపై ఊరేగుతూ వస్తున్న అమ్మవారు.
మెహిదీపట్నం/చాంద్రాయణగుట్ట, జూన్ 22 : రాష్ట్రంలో ఆషాఢమాసం బోనాలను నిర్వహించడంలో సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతో బోనాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ తల్లి మొదటి పూజను లంగర్హౌస్ చౌరస్తాలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించి అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నగరంలో బోనాల నిర్వహణకు సీఎం కేసీఆర్ 15 కోట్ల నిధులను ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, సంఘ సేవకులు సిరుగుమల్లె రాజు వస్తాద్, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీలు ఠాకూర్ జీవన్సింగ్, సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్, నాయకులు శేఖర్ రెడ్డి, కావూరి వెంకటేశ్ పాల్గొన్నారు.
పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల వారు బంగారు బోనాన్ని మంత్రుల చేతుల మీదుగా ఆలయ కమిటీ వారికి అందజేశారు. అనంతరం వేదిక వద్ద నుంచి పట్టు వస్ర్తాలను మంత్రులతో పాటు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, దేవాదాయ కమిషనర్ అనిల్ వెళ్లి చౌరస్తాలో అమ్మవారి రథంలో ఆలయ కమిటీ వారికి అందజేశారు. అనంతరం రథం ముందు ఉన్న తొట్టెల వద్ద కల్లుసాక పోసి పూజలు చేశారు.
లంగర్హౌస్ చౌరస్తాలో నుంచి ప్రారంభమైన తొట్టెల ఊరేగింపు మార్కెట్, హుడా పార్కు, ఫతే దర్వాజల మీదుగా గోల్కొండ ఛోటా బజార్లోని దిగంబర్ పంతులు ఇంటి వద్దకు చేరుకుంది. అక్కడ గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ పూజారి అనంతచారి పంతులు ఇంట్లో నుంచి అమ్మవారి విగ్రహాలను, ఆభరణాలను దిగంబర్ పంతులు ఇంట్లోకి తెచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అమ్మవారి విగ్రహంతో పాటు తొట్టెల ఊరేగింపు కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు చేపట్టారు. అక్కడ తొట్టెల సమర్పణతో తొలిపూజ ఘనంగా ముగిసింది.
బోనాల కులవృత్తుల సంఘం అధ్యక్షుడు బి.సాయిబాబా చారి ఆధ్వర్యంలో గురువారం నజర్ బోనం (సర్కార్ బోనం) ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీకాంత్చారి, సురేశ్ చారి, రాజు, శ్రీధర్, ప్రసాద్, పటేలమ్మ తదితరులు పాల్గొన్నారు.
గోల్కొండ కోటలో రాష్ట్ర కుమ్మరుల సంఘం ఆధ్వర్యంలో తొలిబోనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుమ్మరుల సంఘం నాయకులు నాగరాజు, అనిల్, రాంచందర్, శంకర్, కుమ్మరి సంఘం ప్రతినిధులు విజయ్కుమార్, ప్రేమ్కుమార్, సత్యనారాయణ, ఆర్.కుమార్, పి. వెంకటేశ్ పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజు ఆధ్వర్యంలో గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి గురువారం మొదటి బంగారు బోనం సమర్పించారు. గౌలిపురా మార్కెట్లో కొలువుదీరిన శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయం నుంచి సప్తమాతృకలకు బంగా రు బోనం సమర్పణలో భాగంగా మొదటి బోనం గోల్కొండ అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అలె భాగ్యలక్ష్మి, దేవాలయం అధ్యక్షుడు ఎర్మని కైలాశ్, ప్రధాన కార్యదర్శులు ఎ.మధుసూదన్గిరి, సుమన్ కుమార్, మాజీ కార్పొరేటర్ ఆలె జితేంద్ర, పాశం సురేందర్, ఎస్.మల్లేశం, గాజుల అంజయ్య, మధుసూదన్గౌడ్, రాకేశ్ తివారి పాల్గొన్నారు.