వెంగళరావునగర్ : అర్హులైన వారందరూ కోవిడ్ బారిన పడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోరారు. శుక్రవారం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్లో ఆక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ కరోన మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గమని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల శరీరంలో యాంటిబాడీలు పెరుగుతాయని..దాంతో కరోన వచ్చినా జయించే అవకాశాలు మెండుగా ఉంటాయని..కరోన పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం తగదన్నారు. అనంతరం రక్షణ కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య విజయ్, డాక్టర్ నీలిమ, టీఆర్ఎస్ నాయకులు వేణు, వేణు గోపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.