హైదరాబాద్: టాటా కంపెనీ ఉత్పత్తి అయిన ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్లో ఇద్దరు హైదరాబాదీలు విజయవంతంగా 52 రోజుల్లో 17 వేల కిలోమీటర్ల డ్రైవ్ పూర్తిచేశారు. హైదరాబాద్కు చెందిన ప్రఫుల్లా కొహ్లె, అతని మిత్రుడు ఆశిష్ అరోరా గత అక్టోబర్ 28న టాటా నెక్సాన్ ఈవీ మాక్స్ కారులో ఆలిండియా డ్రైవ్ స్టార్ట్ చేశారు. మొత్తం 52 రోజుల జర్నీలో వారు 17 వేల కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేసి హైదరాబాద్కు తిరిగొచ్చారు.
ఈ సందర్భంగా ఈసీఐఎల్లోని టాటా వెంకటరమణ మోటార్స్ షోరూంలో ఆశిష్ అరోరా, ప్రఫుల్లా కొహ్లెలను వెంకటరమణ మోటార్స్ డైరెక్టర్ వీరేన్ చౌదరి, షోరూం సీఈవో మహేందర్ సన్మానించారు. ఆశిష్ అరోరా మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ కార్లు అనగానే ముందుగా చాలామంది రేంజ్ గురించే ఆలోచిస్తారని, ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినపుడు ఎలక్ట్రిక్ కార్స్ పనికిరావని భావిస్తారని, కార్ల చార్జింగ్ స్టేషన్స్ కోసం వెతకాల్సి వస్తుందని, ఇదంతా రిస్క్ ఫాక్టర్ అని భయపడుతారని చెప్పారు.
అలాంటి వారికి టాటా నెక్సాన్ మాక్స్ కారులో తాము చేసిన ఈ సాహసోపేతమైన ఆలిండియా డ్రైవ్తో నమ్మకం కుదురుతుందన్నారు. ఎలక్ట్రిక్ కార్లలో ఎంత దూరమైనా ప్రయాణించవచ్చనే భరోసా వస్తుందని చెప్పారు. ఫ్యూచర్ మొబిలిటీ అంతా ఎలక్ట్రిక్ వెహికిల్సేనని ఆశిష్ తెలిపారు. ఇక వారి ఆలిండియా డ్రైవ్ గురించి మాట్లాడుతూ.. టాటా నెక్సాన్ ఈవీని ఒక్కసారి ఫుల్చార్జ్ చేస్తే ఒక్కరోజులో దాదాపు 350 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బందిలేకుండా డ్రైవ్ చేయగలిగామని చెప్పారు.
కారులో ఇచ్చిన యాప్తో చార్జింగ్ స్టేషన్స్ ఇండికేషన్స్ తెలుసుకుంటూ మొత్తం రూట్లో అక్కడక్కడ ఫాస్ట్ ఛార్జర్స్ అండ్ స్లో ఛార్జింగ్ అలా అవసరమనుకుంటే ఒక గంట హాల్ట్ తీసుకుని చార్జ్ చేసుకుంటూ మళ్ళీ డ్రైవ్ కంటిన్యూ చేశామని ఆశిష్ వివరించారు.