మహేశ్వరం, నవంబర్ 13: చట్టం ముందు అందరూ సమానులేనని రాష్ట్ర లీగల్సెల్ కార్యదర్శి రేణుక అన్నారు.శనివారం మహేశ్వరం కేంద్రంలోని గడీకోట మైదానంలో న్యాయ విజ్ఞాన సదస్సును రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ షెషన్ జడ్జి తిరుపతితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..న్యాయ సేవలను ప్రజలకు తెలియజేసేందుకు గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులను ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు. మహిళలు, చిన్న పిల్లలు, ఎస్సీ, ఎస్టీలు, కార్మికులు, అంగవైకల్యం గలవారికి ప్రభుత్వాలు ఉచితంగా న్యాయ సేవలను అందించి వారికి పారితోషికాలు అందిస్తున్నదని ఆమె అన్నారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్, కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్జైన్, ఆర్డీవో వెంకటాచలం, డీసీపీ సన్ప్రీత్సింగ్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, జిల్లా లీగల్ సెక్రటరీ శ్రీదేవి, మహేశ్వరం జూనియర్ సివిల్కోర్టు జడ్జి ఫరీన్కౌసర్, ఇబ్రహీంపట్నం సబ్ జడ్జి ఇందిర, మహేశ్వరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, సెక్రటరీ శ్రీపాల్రెడ్డి సీనియర్ న్యాయవాదులు, జడ్పీటీసీ జంగారెడ్డి,ఎంపీపీ రఘుమారెడ్డి,వైస్ ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్,ఎంపీడీవో నర్సింహులు, ఎంఈవో కృష్ణయ్య,ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి,సీఐ మధుసూదన్, మహేశ్వరం సర్పంచ్ ప్రియాంకరాజేశ్, ప్రజలు పాల్గొన్నారు.