సికింద్రాబాద్/ మారేడ్పల్లి, జనవరి7: సికింద్రాబాద్లోని ఆలయాల్లో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతలను మహంకాళి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, మేకల సారంగపాణి,నాయకుడు భాస్కర్గిరి ఆధ్వర్యంలో ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలోనాయకులు రాజ్, అనిల్, వెంకటేష్, అజయ్, అక్షిత్, రోహిత్ పాల్గొన్నారు.
మేడిబావిలో..
మేడిబావి బస్తీలో నివసిస్తున్న ప్రజలకు శ్రీరాముడి అక్షింతలను బీజేపీ నాయకులు కనకట్ల అరవింద్హరి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాము, ప్రసాద్, కల్యాణ్, రాజ్వీర్ పాల్గొన్నారు.
కంటోన్మెంట్ ఐదో వార్డు వాసవీనగర్లో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఆదివారం కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు జే. రామకృష్ణ శోభాయాత్ర నిర్వహిస్తూ ఇంటింటికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవీనగర్ కాలనీ వాసులు, హిందూ సంఘాల నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఓల్డ్ వాసవీగర్లో..
ఐదో వార్డులోని ఓల్డ్ వాసవీనగర్లో ఇంటింటికీ అయోధ్య శ్రీ రాముడి అక్షింతలను ప్రముఖ సామాజిక కార్యకర్త, బీఆర్ఎస్ నాయకులు తేలుకుంట సతీష్ గుప్తా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మణిగండ్ల శ్రీనివాస్, కాకాగూడ బాలకృష్ణ, బొజ్జ అజయ్, గంప సాయి ప్రసాద్, రాకేశ్, సునీల్ పాల్గొన్నారు.