వ్యవసాయ యూనివర్సిటీ , అక్టోబర్ 24: వ్యవసాయ కళాశాలలో చదివిన 1967-71 బ్యాచ్కు చెందిన విద్యార్థులు కళాశాల ఆడిటోరియంలో ఆదివారం ఉత్సాహంగా పూర్వ వి ద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. తాము వ్యవసాయ విద్యను అభ్యసించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఒకరిని ఒకరూ పలకరించుకుంటూ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
అప్పటి అధ్యాపకులు డా. ఆర్ఆర్ చౌదరి , గోవిందరావు , జ్ఞాన కుమారి, నాగేశ్వర్రావు, డా. నర్సిరెడ్డి, అభికుమార్, నర్సిరెడ్డి, డీవీ రాయుడు, నరోత్తమ్రెడ్డి తదితరులను సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వపు వి ద్యార్థి చంద్రశేఖర్రావు వ్యవసాయ కళాశాల అభివృద్ధికి రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం డా. సుదర్శన్ రెడి, బుచ్చిరెడ్డి , భాస్కర్రెడ్డి, మాదవ్రెడ్డి , రవీంద్రరావు , రాజేశ్వర్ రావు, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.